ఒకప్పుడు కథానాయికగా కోలీవుడ్లో తిరుగులేని క్రేజీని సంపాదించుకున్న నటి అంజలి. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆమె చెన్నై విడిచి హైదరాబాద్ వెళ్లారు. దీంతో తమిళ సినిమాలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ కోలీవుడ్పై దృష్టి పెట్టింది. ఇప్పటికే శశికుమార్కు జోడీగా ‘నాడోడిగల్ 2’లో నటిస్తోంది. ఇదిలా ఉండగా త్వరలోనే విజయ్ సేతుపతితో జోడీ కట్టనుంది. విజయ్ సేతుపతి హీరోగా ‘పన్నయారుం పద్మినియుం’, ‘సేతుపతి’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అరుణ్కుమార్. ప్రసుత్తం విజయ్ సేతుపతితో మూడో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో అంజలి నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ‘ఇరైవి’ చిత్రంలో విజయ్సేతుపతి, అంజలి కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని కోలీవుడ్ సమాచారం.