నాగశౌర్య హీరోగా నర్తనశాల సినిమా ఇటీవలే అఫీషియల్గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. కానీ హీరోయిన్కి సంబంధించి మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మెహ్రీన్ కౌర్ను చిత్రబృందం సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ విషయంలో మూవీ మేకర్స్ బాగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అమ్మడు నర్తనశాల సినిమా కోసం రూ.90లక్షలు ఛార్జ్ చేసిందట. అంతేనా రోజువారీ ఖర్చుల కోసం రూ.20 వేలు కావాలని కోరిందట. దీంతో నిర్మాతలకు దిమ్మ తిరిగిపోయి.. ఆలోచనలో పడ్డారని టాక్. అన్ని ఓకే అయితే ఈ సినిమా ఏప్రిల్ 12న సెట్స్పైకి రానుంది.