ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ బాబు భరత్ అనే నేను షిఫ్ట్ అయిందా ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 24, 2018, 06:35 PM



కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా హక్కు నిరసనలు జరుగుతున్నాయి అని తెలిసిన విషయమే . అన్ని పార్టీలతో సహా సామాన్యులు కూడా కేంద్రం వైఖరికి నిరసనగా పలు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. `ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు` అనే నినాదం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన `రంగస్థలం` ప్రీ రిలీజ్ వేడుకకు నిరసనల సెగ తగిలిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఒక హోదా స్థానంలో ఉండి  కుడా ఏం  మాట్లాడలేరని   దీంతో ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన చిరు అండ్ కో పై నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న `భరత్ అను నేను` చిత్రం ఆడియో  వేడుక వేదికను విశాఖపట్నం నుంచి విజయవాడకు మార్చినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి ఏప్రిల్ మొదటి వారంలో ఆ ఆడియో ఫంక్షన్ ను విశాఖలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో గొడవ జరగడం అందులోనూ సినీ నటులు ప్రత్యేక హోదాపై గళం విప్పడంలేదంటూ....టీడీపీ నేతలు విమర్శించడం వంటి పరిణామాలతో వేదికను విజయవాడ-గుంటూరు మధ్యలోకి మార్చారు. మహేష్ బాబుకు రాజకీయాలకు సంబంధం లేకపోయినా టీడీపీ నేతల విమర్శలతో ఈ రకంగా ప్లాన్ చేశారని టాక్ ఉంది. దానికి తోడు గుంటూరులో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో టీడీపీపై పవన్ నిప్పులు చెరగడంతో ఆ పార్టీకి డ్యామేజీ జరిగింది. దీంతో మహేష్ బావ ఎంపీగా ఉన్న గుంటూరు ప్రాంతంలో మహేష్ సందడి చేస్తే....కొద్దిగా టీడీపీకి ప్లస్ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారని వినికిడి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఏదో ఒక సందడి జరుగడం వల్ల ప్రభుత్వానికి టీడీపీకి రియల్ ఎస్టేట్ కు లాభం ఉంటుందని ఇలా ప్లాన్ చేశారని భోగట్టా. అదీగాక ఆ సినిమా దర్శకుడు కొరటాల శివకు గుంటూరు విజయవాడల పై మక్కువ ఎక్కువ కావడం ఆయన మిత్రుడు సుధాకర్ ఆ ప్రాంతంలో సినిమాల బయ్యర్ కావడం మరో కారణమని టాక్. ఏది ఏమైనా మరి హోదా నిరసనలు తగలకుండా భరత్ బయటపడతాడో లేదో వేచి చూడాలి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com