దేవాకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ కలిసి నటిస్తున్న సినిమా "రిపబ్లిక్". ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. ట్రైలర్ లోని డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. అయితే విడుదల చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాక ఇప్పటి వరకు ఈ ట్రైలర్ 4.7కే మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. రిపబ్లిక్ ట్రైలర్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో నంబర్ వన్ పొజిషన్ లో ట్రెండ్ అవుతోంది. పొలిటికల్ టచ్ తో ఉన్న ఈ రిపబ్లిక్ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కో జగపతి బాబు, రమ్యకృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.