“రిపబ్లిక్” మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు… రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు వరుసగా… ప్రెస్మీట్లు పెట్టి… కౌంటర్ లు ఇస్తున్నారు ఏపీ మంత్రులు. అయితే తాజాగా మోహన్ బాబు కూడా స్పందించారు. తన చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్.. తన కంటే చిన్నవాడని.. అందుకని ఏకవచనంతో సంబోధిస్తున్నానని పేర్కొన్నారు. చాలా కాలానికి తనను పవన్ కళ్యాణ్ మెల్లగా లాగాడు, సంతోషమేనని వెల్లడించారు. ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయని…తన కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడని గుర్తు చేశారు మోహన్ బాబు. అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయని… ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అడిగిన ప్రతిమాటకి తాను హృదయపూర్వకంగా సమాధానం చెబుతానని సింపుల్ గా పవన్ కి చురకలు అంటించారు. ఈలోగా పవన్ చేయవలసిన ఓ ముఖ్యమైన పని ఉందని…మా ఎన్నికల్లో విష్ణు బాబుకి ఓటేయాలని కోరారు మోహన్ బాబు. విష్ణు ప్యానల్ కి ఓటు వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు మోహన్ బాబు. ఈ మేరకు తన ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు మోహన్ బాబు.