అక్టోబర్ 3వ తేదీ నుంచి ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ గురించి ప్రముఖ లాయర్లు అమిత్ దేశాయ్, సతీష్ మాన్షిండే లాంటి వాళ్లు తమ వాదనలు వినిపించారు. అయితే న్యాయమూర్తులను వారి వాదనలు మెప్పించలేపోకపోవడంతో ఆర్యన్ ఖాన్కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.ఇక ఆర్యన్ ఖాన్కు ఎలాగైనా బెయిల్ ఇప్పించాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తూ కేసును వాదించే బాధ్యతను దేశంలోనే ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్గీకి అప్పగించారు. గతంలో రోహత్గీ అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. విపత్కర, దయనీయమైన పరిస్థితుల మధ్య షారుక్ అభ్యర్థన మేరకు ఈ కేసును ముకుల్ రోహత్గీ టేకప్ చేశారు.