సూపర్ స్టార్ రజనీకాంత్ తన సతీమణి లతతో కలిసి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను, ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. తొలుత రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతి కోవింద్ను కలిశారు. అక్కడి నుంచి ప్రధాని నివాసాకి వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. ఈ విషయాన్ని రజనీకాంత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాష్ట్రపతి, ప్రధానిలను కలిసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇరువురిని కలుసుకుని వారి ఆశీస్సులు, అభినందలు పొండం ఆనందంగా ఉందన్నారు.67వ జాతీయ సినీ అవార్డ్స్ ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రజినీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.