ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పుష్ప' మాస్ ట్రీట్ రెడీ... రేపు ఉదయం 11:07 గంటలకు రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 27, 2021, 07:50 PM



సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''పుష్ప''. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ డ్రామాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా 'సామీ సామీ' అనే సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ విడుదల చేస్తున్నారు.


ప్రేక్షకులకు మాస్ ట్రీట్ అందించబోయే 'సామీ సామీ' పాటను రేపు (అక్టోబర్ 28) ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ పాట ప్రోమోని వదిలారు. 'నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే.. నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ.. నా సామీ' అంటూ రష్మిక మాస్ స్టెప్పులతో రచ్చ చేసింది. ముఖ్యంగా పుష్పరాజ్ కోసం శ్రీవల్లి పైట కొంగు జారేస్తూ వేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది.


అల్లు అర్జున్ - రష్మిక మందన్నా ఇద్దరూ డీ గ్లామర్ లుక్స్ లో కనిపిస్తున్నారు. పుష్పరాజ్ గురించి శ్రీవల్లి పాడుకునే ఈ పాట వెనక కథేమిటో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా.. సింగర్ మౌనిక యాదవ్ ఈ గీతాన్ని ఆలపించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన 'దాక్కో దాక్కో మేక' 'శ్రీవల్లి' సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. మరి 'సామీ సామీ' అంటూ వస్తున్న ఈ మాస్ నంబర్ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి..


కాగా మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ''పుష్ప'' సినిమాని నిర్మిస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చూసుకుంటున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com