టాలీవుడ్ ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా వల్ల మృతి చెందారు. హైదరాబాదు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన నిన్న కన్నుమూశారు. అయితే, శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు నేడు మహాప్రస్థానం శ్మశానవాటికలో జరిగింది. యాంకర్ ఓంకార్ మాట్లాడ్తూ ఆట డ్యాన్స్ షో నుంచి శివశంకర్ మాస్టర్ తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది అని ఓంకార్ తెలిపారు. శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలో ఓంకార్ పాడె మోశారు. అయితే ఓంకార్ సోదరుడు అశ్విన్ కూడా శివశంకర్ మాస్టర్ పాడె మోశారు.శివశంకర్ మాస్టర్ పెద్ద కొడుకు విజయ్ కూడా కరోనాతో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు , శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు అజయ్ తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేసాడు.