ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పాట కోసం ఎంతో కసరత్తు చేశాను: తమన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 29, 2021, 10:27 PM



ప్రస్తుతం రాకెట్ లా దూసుకుపోతున్నాడు తమన్, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. పవన్ బీమ్లానాయక్ మూవీ కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయన టైటిల్ సాంగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజా ఇంటార్వ్యులో తమన్ కొన్ని విషయాలు పంచుకున్నాడు.అవి మీకోసం.. సాధారణంగా ఏ విషయంలోనైనా కొన్ని అంచనాలు పెంచుకోవడం జరుగుతుంది. ఆ అంచనాలను అందుకోలేక పోయినప్పుడు సహజంగానే బాధ కలుగుతుంది. 'అరవింద సమేత'  సినిమాలోని ఒక పాట విషయంలో తనకి అలాంటి అనుభవమే ఎదురైందని తాజా ఇంటార్వ్యులో తమన్ అన్నాడు.

'అరవింద సమేత' సినిమాలో 'యాడబోయినాడో' అనే ఒక పాట కోసం ఎంతో కసరత్తు చేశాను. వైజాగ్ నుంచి నికిత అనే అమ్మాయిని పిలిపించి ఆ పాటను పాడించాం. ఆ అమ్మాయి ఎంతో అద్భుతంగా పాడింది. నా కుటుంబంలో జరిగిన ఒక విషాద సంఘటనను గుర్తుచేసుకుని, ఒక మూడ్ లోకి వెళ్లి చేసిన పాట అది.
ఆ పాట ట్యూన్ కానీ .. పాడటం గాని అంత తేలికైన విషయం కాదు. ఒక రేంజ్ లో ఆ పాట ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అనుకున్నాను. కానీ ఆ సినిమాలో మిగతా పాటలకి వచ్చిన గుర్తింపు ఆ పాటకి రాలేదు. అప్పుడు మాత్రం నాకు ఎంతో బాధ కలిగింది. నేను మంచి అనుభూతిని పొంది చేసిన పాటల్లో నిరాశపరిచింది ఇదే" అని చెప్పుకొచ్చాడు తమన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com