సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ మధ్య అస్వస్థతకు గురైయ్యారు. కిమ్స్ ఆస్పత్రి అయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నవంబర్ 24న న్యూమోనియా కారణంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం ఐసీయూలో సీతారామశాస్త్రి ఉంచి వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. నిపుణులైన డాక్టర్లు పర్యవేక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ బులిటెన్లో తెలిపారు .