ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ‌హేష్ క‌టౌట్‌పై ఆర్జీవీ ట్వీట్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 19, 2018, 03:02 PM



సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, హ్యాట్రిక్ విజ‌యాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం `భ‌ర‌త్ అనే నేను`. ఈ సినిమా శుక్ర‌వారంనాడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాలో మ‌హేష్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.


 తాజాగా ఈ సినిమా క‌టౌట్‌పై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించారు. త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా `భ‌ర‌త్ అనే నేను` టీమ్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. `చాలా అద్భుతంగా ఉంది. `భ‌ర‌త్ అనే నేను` టీమ్‌కు శుభాకాంక్ష‌లు` అంటూ వ‌ర్మ ట్వీట్ చేశాడు. వ‌ర్మ ప్ర‌స్తుతం `కింగ్‌` నాగార్జున‌తో `ఆఫీస‌ర్‌` సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com