జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. గురువారం రాత్రి మొదలు శుక్రవారం వరకూ కొన్ని మీడియా ఛానళ్లపై వరుస విమర్శలు.. ఆరోపణలు చేస్తున్న ఆయన తాజాగా మరోసారి ఆసక్తికర ట్వీట్లు చేయటం సంచలనంగా మారింది.పవన్ మీడియా మీద దాడి చేస్తున్నారంటూ విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ పవన్ మాత్రం తన ట్వీట్లను ఆపలేదు. ఓపక్క ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పవన్ పై రూ.10 కోట్ల పరువునష్టం కేసును దాఖలు చేయనున్నట్లు ప్రకటించగా.. టీవీ 9కు చెందిన శ్రీనిరాజు సైతం భారీ మొత్తంలో పరువునష్టం దావాను వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇలాంటి వేళ.. నిజమైన “అజ్ఞ్యాతవాసి” మీకెవరో తెలుసా? అంటూ పవర్ ట్వీట్ల వర్షం కురిపించారు. ఒక ప్రముఖ ఛానల్ ను లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక ప్రముఖ ఛానల్ కు చెందిన పాపులర్ ప్రోగ్రామ్ లకు తనదైన వ్యాఖ్యానాన్ని జోడిస్తే ఎటకారం చేసుకున్న పవన్.. మరో ప్రముఖ ఛానల్లో మోస్ట్ పాపులర్ షోపైనా సటైర్ వేయటం చూస్తే.. శుక్రవారం సాయంత్రం పవన్ చేసిన ట్వీట్ ఒకటి గుర్తు రాక మానదు. తన అభిమానులు ఎవరూ వయిలెంట్ గా రియాక్ట్ కావొద్దని..తనపై కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నారని.. తానో సుదీర్ఘమైన న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా పవన్ పేర్కొన్నారు.
ఇందుకు తగ్గట్లే పవన్ హోంవర్క్ చేస్తున్నారా? అన్న సందేహాన్ని రేకెత్తించేలా తాజాగా ట్వీట్లు ఉండటం గమనార్హం.
పవన్ తాజాగా చేసిన ట్వీట్లు చూస్తే..
- నాకు ఇష్టమైన స్లోగన్ “ ఫ్యాక్షనిస్టుల ఆస్తలుని జాతీయం చెయ్యాలి” అసలు యీ స్లోగన్ వెనకాల కథ కి యీ స్లోగన్ కి సంబంధం ఏంటి?
- “బట్టలు విప్పి మాట్లాడుకుందాం” ప్రోగ్రాం నుంచి పవన్ కల్యాణ్ విత్ కెమేరామన్ ట్విట్టర్
- ఒక రాష్ట్ర కాబినెట్ ర్యాంక్ మంత్రి స్వయానా ఈ “ అజ్ఞ్యాతవాసి” ని “ వాడో బ్లాక్ మెయిలర్ అని స్వయానా సీఎం గారు అన్నారని “ఒకరి”తో అన్నారు. ఆ మంత్రి ఎవరు? ఆ ముఖ్యమంత్రి ఎవరు? “ఒకరు” ఎవరు? తెలుసుకోవాలనివుందా !
- స్టే ట్యూన్డ్.. లైవ్ ఫ్రం హైదరాబాద్. నిజాలివి నిగ్గు తేలుద్దాం ప్రోగ్రాం నుంచి మీ పవన్ కల్యాణ్
- నిజమైన “అజ్ఞ్యాతవాసి” మీకు ఎవరో తెలుసా??
Stay tuned to “బట్టలు విప్పి మాట్లాడుకుందాం” program nunchi - Pawan Kalyan with cameraman Twitter.
— Pawan Kalyan (@PawanKalyan) April 21, 2018