రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, ఓం రౌత్ మరియు సందీప్ రెడ్డి వంగాతో పని చేస్తున్నాడు.దర్శకుడు మారుతీ తో కూడా ప్రభాస్ సినిమా తీస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'భలే భలే మొగాడివోయ్' వంటి హిట్స్ ఉన్న మారుతీ, ప్రభాస్ కి 'రాజా డీలక్స్' అనే స్క్రిప్ట్ను వివరించినట్లు యూవీ క్రియేషన్స్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుందని సమాచారం. హారర్-కామెడీతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాలుగైదు నెలల్లో పూర్తి చేయవచ్చని వెళ్ళడించారు.మారుతి ప్రస్తుతం గోపీచంద్ మరియు రాశి ఖన్నాతో 'పక్కా కమర్షియల్' చేస్తున్నాడు. ఈ 2022 సమ్మర్లో 'రాధే శ్యామ్' విడుదల కోసం ప్రభాస్ ఎదురుచూస్తున్నాడు.