ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ బాబు...త్రివిక్రమ్ కాంబినేషన్లో కొత్త చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 08:03 PM



త్వరలో హీరో మహేష్ బాబు...త్రివిక్రమ్ కాంబినేషన్లో కొత్త చిత్రం రానున్నది. త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసేసి త్రివిక్రమ్ రెడీగా ఉన్నాడు. అసలు ఈ పాటికే ఈ సినిమా షూటింగు మొదలుకావలసింది. కానీ కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. మహేశ్ మోకాలు సర్జరీ కూడా మరింత ఆలస్యానికి కారణమైంది. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందనే విషయంపై అంతా ఆసక్తిగా ఉన్నారు. ఏప్రిల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ముందుగా మహేశ్ బాబు 'సర్కారువారి పాట' బ్యాలెన్స్ షూటింగును పూర్తి చేసి, ఆ తరువాతనే త్రివిక్రమ్ ప్రాజెక్టుపైకి రానున్నాడు. ఈ సినిమా ఎంతలేదన్నా ఒక ఎనిమిది నెలల సమయం తీసుకుంటుంది. అందువలన సంక్రాంతి బరిలోనే ఈ సినిమాను నిలపాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. ఆ విధంగానే ప్లానింగ్ జరిగిపోయిందని చెబుతున్నారు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా గోపీచంద్ పేరు వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com