బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, వ్యాపార వేత్త ఆనంద్ ఆహుజాల వివాహం మే 8న జరగనున్న సంగతి తెలిసిందే. మే 7న సోనమ్ ఇంట మెహందీ సెర్మనీ జరగనుంది. కపూర్ ఫ్యామిలీ, ఆహుజా ఫ్యామిలీ అంతా మెహందీ ఈవెంట్లో తమ ఆట పాటలతో అలరించనున్నారు. అయితే అఫీషియల్ పెళ్ళి ప్రకటన తర్వాత తొలిసారి సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజాలు కెమెరా కంటికి చిక్కారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న క్లినిక్ బయట కనిపించిన ఈ జంటని ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలలో బంధించారు. ప్రస్తుతం వీరి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిరివురి పెళ్లి జరగనుండగా, పెళ్ళి వేడుకకి ప్రతి ఒక్కరు ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ ధరించి రావాలని కోరారు కపూర్, అహుజా ఫ్యామిలీస్. సోనమ్ పెళ్ళికి బాలీవుడ్ అంతా తరలిరానుంది . పెళ్లి తర్వాత తన తాజా చిత్రం వీరే ది వెడ్డింగ్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొననుంది సోనమ్. ఈ చిత్రం జూన్ 1న విడుదల కానుంది. మరోవైపు సంజూ చిత్రంలో గెస్ట్ పాత్ర పోషిస్తున్న సోనమ్ మే 14, 15 తేదీలలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై నడవనుంది.