మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మహానటి` సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సావిత్రి నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం, సినిమాలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తుండడం `మహానటి`పై ఆసక్తికి కారణాలు. ఆ సినిమాలో కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్బాబు, సింగీతం శ్రీనివాసరావు, డైరెక్టర్ క్రిష్, ప్రకాష్రాజ్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమాలో మరో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నటిస్తోందంటూ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఈ విషయాన్ని `మహానటి` చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. కాజల్ ఫోటోను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ``మహానటి`లో కాజల్ ఏమి చేస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మే తొమ్మిదో తేదీ వరకు ఆగండి` అంటూ కామెంట్ కూడా పెట్టింది.