ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం `నా నువ్వే`. జయేంద్ర దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు..ఈ సందర్భంగా ఈ చిత్ర హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ – “ఈమధ్య కొత్త దర్శకుల కథలనే వింటున్నాను. నేను కలిసిన అలాంటి యువ దర్శకుల్లో ఎక్కువ మంది జయేంద్రగారితో పనిచేయాలనుకున్నవారే. అలాంటి దర్శకుడితో నేను పనిచేయడం ఆనందంగా ఉంది. మంచి దయగల, మృదు స్వభావంగల, స్వచ్ఛమైన ప్రేమ, ఎమోషన్స్ను కలిగిన వ్యక్తి. మంచి అనుభవమున్న వ్యక్తి. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ నాకు బాగా నచ్చింది. నాకు వ్యక్తిగతంగా కూడా ఆ కోర్ పాయింట్ బాగా నచ్చుతుంది. సెన్సిటివ్, బ్యూటీఫుల్ మూమెంట్స్ను తెరపై ఆర్.జె.మీరాగా ప్రెజెంట్ చేసే అవకాశాన్ని నాకు కలిగించిన జయేంద్రగారికి థాంక్స్. ఈ సినిమా చేయడం ఎగ్జయిటింగ్గా ఉంది. నాకు స్పెషల్ మూవీ. శరత్గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. నా నువ్వే .. సాంగ్ నాకు బాగా నచ్చింది. మహేశ్, కిరణ్, విజయ్గారు మంచి సపోర్ట్ అందించారు. వారి వల్లే బెస్ట్ మూవీ వచ్చింది. రామజోగయ్యగారు, అనంత శ్రీరామ్గారు మంచి సాహిత్యాన్ని అందించారు. కల్యాణ్ రామ్ లేకుంటే ఈ సినిమాను పూర్తి చేసే దాన్ని కాదు. మోస్ట్ సపోర్టివ్ కోస్టార్. తన డేడికేషన్ లెవల్స్ మరో స్థాయిలో ఉండటాన్ని గమనించాను.“ అన్నారు.