మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ సినిమాకు ‘తేజ్ ఐ లవ్ యు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వరుస పరాజయాల్లో ఉన్న ధరమ్ తేజ్ నుండి కొత్తదనాన్ని ఆశిస్తున్న పేక్షకులు టీజర్ చూశాక ఈ సినిమాపై నమ్మకం పెంచుకున్నారు. తేజ్ కూడ ఈ చిత్రం తనకు మంచి సక్సెస్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇకపోతే ఒక రొమాంటిక్ పాట, కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం పారిస్ వెళ్లిన చిత్ర టీమ్ ఇటీవలే అక్కడ చిత్రీకరణను ముగించారు. పాట, సన్నివేశాలు చక్కగా వచ్చాయని తెలుస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవి తర్వాత ప్రేక్షకుల ముందుకురానుంది.