బాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. విరాట్-అనుష్క శర్మల వివాహం తర్వాత ఇప్పుడు సోనమ్కపూర్, ఆనంద్ అహూజాలు పెళ్లి చేసుకోబోతున్నారు. ముంబయిలో ఈరోజు వీరి వివాహం ఘనంగా జరగబోతోంది. అయితే ఇప్పుడు బాలీవుడ్లో మరో పెళ్లి కబురు వినిపిస్తోంది.
నటి కృతి సనన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. వీరిద్దరూ జంటగా ‘రాబ్తా’ చిత్రంలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమించుకున్నారని గతంలో వదంతులు వినిపించాయి. అదీకాకుండా ‘రాబ్తా’ చిత్రీకరణ సమయంలో సుశాంత్ ఓ అమ్మాయి చెయ్యి పట్టుకుని దిగిన ఫొటోను సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ ‘త్వరలో వెల్లడిస్తాను’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో ఆ చెయ్యి కృతి సనన్దేనని పలు ఆంగ్ల మీడియాలు రాసేశాయి.
దీనిపై కృతి స్పందిస్తూ..‘ఇలాంటి విషయాలు నాపై ప్రభావం చూపుతాయి’ అని అంది. మరో విషయమేంటంటే.. ఆదివారం కృతి తన కుటుంబంతో కలిసి సుశాంత్ ఇంటికి వెళ్లిందట. ఈ విషయాన్ని ముంబయికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ విరాల్ భయానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు పోస్ట్ చేశారు. ఆ తర్వాత సుశాంత్, కృతి కలిసి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా షోరూంకు కూడా వెళ్లినట్లు పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్లో మరో పెళ్లి కబురు వినిపించబోతోందని బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.