బాలయ్య, వెంకటేష్ వంటి బడా హీరోల సినిమాల నుండి తప్పుకున్న దర్శకుడు తేజ ప్రస్తుతం ఏ హీరోతో సినిమా చేస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆయన నాగార్జునతో పనిచేయనున్నారని కొద్దిరోజుల క్రితమే వార్తలు రాగా ఇప్పుడు రానాతో సినిమాకు సిద్దమవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.తేజ 1971 ఇండో – పాక్ యుద్ధం నేపథ్యంలో ఒక కథను తయారుచేసి రానాకు చెప్పాడని, రానా అందుకు అంగీకరించారని, ఆ కథలో రానా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడవలేదు. ఇకపోతే గత ఏడాది ఈ ఇద్దరూ కలిసి ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి హిట్ సినిమాను అందించిన సంగతి తెలిసిందే.