ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న మచ్ఎవైటెడ్ మూమెంట్ వచ్చేసింది. బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముంబైలోని కవితా సింగ్ హరిటేజ్ బంగ్లా (రాక్డేల్)లో వీరిద్దరు ఒక్కటయ్యారు. సిక్ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగినట్టు తెలుస్తుంది. భారీ నగలతో అందమైన శారీలో సోనమ్ మెరవగా, ఆనంద్ కుర్తాలో కనిపించారు. వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం ఆనంద్ ఆహుజా ఫ్యామిలీ లీలాహోటల్లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేసింది. సోనమ్ పెళ్లి వేడుకలో అనీల్ కపూర్, హర్ష వర్ధన్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. పెళ్లికి వచ్చిన అతిధులని ఆహ్వానిస్తూ సందడి చేశారు. శ్రీదేవి తనయలిద్దరు తండ్రితో కలిసి పెళ్లి వేడుకకి హాజరయ్యారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీలు పెళ్ళికి హాజరు కావడంతో అక్కడి వాతావరణం కోలాహాలంగా మారింది. సోనమ్-ఆహుజాల మెహిందీ వేడుక ఆదివారం రాత్రి సోనమ్ ఇంట్లో జరగగా, నిన్న సాయంత్రం సంగీత్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే.