ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న‌గ‌ర‌వాసుల‌కి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్ డే గిఫ్ట్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 09, 2018, 11:48 AM



అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌ని మెస్మ‌రైజ్ చేసే విజ‌య్ ఈ రోజు త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా వినూత్న ఆలోచ‌న చేశాడు. న‌గ‌రంలో ఎండ‌లకి అల‌మ‌టిస్తున్న వారికి ఐస్‌క్రీమ్స్ అందించి వారిని కూల్ చేసేందుకు బ‌ర్త్‌డే ట్ర‌క్‌ల‌ని ఏర్పాటు చేసుకున్నాడు. త‌న ట్విట్ట‌ర్‌లో వీటికి సంబంధించిన వివ‌రాలు తెలియ‌జేశాడు. స‌మ్మ‌ర్‌లో కొన్ని రోజులు షూటింగ్ చేసిన త‌ర్వాత చ‌ల్ల‌ని ఐస్‌క్రీమ్స్ అందించాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. మూడు ఐస్‌క్రీమ్ ట్ర‌క్కుల‌ని తీసుకున్నాను. ఇవి హైద‌రాబాద్ సిటీ అంతా తిరుగుతూ ఎండ‌ల‌లో వ‌ర్క్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు, చిరు వ్యాపారులు, విద్యార్ధులు, ఉద్యోగులు ఇలా ప‌లువుర‌కి ఉచితంగా ఐస్‌క్రీమ్స్ అందిస్తాయి. . మీకు ఎక్కడైనా నా బర్త్‌డే ట్రక్ కనిపిస్తే ఏం సిగ్గుపడకుండా ఐస్‌క్రీమ్ తీసుకోండి. హాయిగా ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను నాకు షేర్ చేయండి. మీకు ముఖాల్లో ఆనందాన్ని చూస్తే నేను హ్యాపీగా ఫీలవుతానంటూ’ హీరో విజయ్ తన ట్వీట్లలో రాసుకొచ్చారు. 




విజ‌య్ చేసిన ఈ ఆలోచ‌నపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తూ త‌నకి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఇలాంటి బ‌ర్త్‌డేలు ఎన్నో జ‌రుపుకోవాల‌ని శుభాశీస్సులు అందిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన మ‌హాన‌టి చిత్రం ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు రాగా ఇందులో విజ‌య్ ఆంటోని పాత్ర పోషించాడు. ఇక టాక్సీవాలా అనే చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం డైరక్షన్ లో గీతా గొవిందం సినిమా చేస్తున్నాడు విజయ్. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు చిత్ర నిర్మాతలలో ఒకరైన యాష్‌ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు .డియర్ కామ్రేడ్ అనే టైటిల్ చిత్రానికి ఖరారు చేశారు. ఎవడే సుబ్రమణ్యం సినిమా నిర్మించిన స్వప్నా సినిమాస్ బ్యానర్‌లో స్వప్న దత్ నిర్మాతగా నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడట విజయ్. ఇక అదే కాకుండా రాజు డికె డైరక్షన్ లో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మ‌రో వైపు నోటా అనే బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ . 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com