బెంగళూరు డేస్ చిత్రంతో ఫుల్ పాపులర్ అయిన మలయాళ నటి పార్వతి. ఉత్తమ విలన్ అనే సినిమాలో కమల్ హాసన్తో కలిసి నటించిన ఈ అమ్మడు 2017లో టేక్ ఆఫ్ అనే సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం మై స్టోరీ, శివరంజియుం ఇన్నుం సిల పెంగలం, ఆటోరిక్షాకరంటే చిత్రాలతో పాటు అంజలీ మీనన్ తెరకెక్కించనున్న చిత్రాలతో బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడు పెద్ద ప్రమాదం నుండి సురక్షితంగా తప్పించుకుంది. ఆలపుజా జిల్లాలోని కొమ్మడి అనే ప్రాంతంలో పార్వతి ప్రయాణిస్తున్న కారు నేషనల్ హైవేపై మరో కారుని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు పార్వతీకి ఎలాంటి గాయాలేదు. దీంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. పార్వతీ కారు యాక్సిడెంట్ జరిగిందనే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ స్థలాన్ని పరిశీలించి యాక్సిడెంట్ ఎలా జరిగిందనే కోణంలో విచారిస్తున్నారు. అప్పట్లో పవన్ కళ్యాన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో కథానాయికగా పార్వతీనే తీసుకోనున్నారని పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే.