యువ హీరో శర్వానంద్, సాయి పల్లవిలు జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ, అందాల రాక్షసి’ వంటి చిత్రాల్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు హను రాఘవపుడి ఈ చిత్రంని తెరకెక్కిస్తున్నారు. ఇన్నాళ్లు కలకత్తాలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా ఆ షెడ్యూల్ ను ముగించుకుంది.మరో షెడ్యూల్ ఈ నెల 11వ తేదీ నుండి హైదరాబాద్లో మొదలుకానుంది. ఈ షూట్లో శర్వానంద్, సాయి పల్లవి ఇద్దరూ పాల్గొననున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుంది.