స్టార్ హీరోయిన్ సమంత వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది విడుదలైన ఆమె మొదటి చిత్రం ‘రంగస్థలం’ భారీ విజయాన్ని అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సుమారు రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రంలో సమంత రామలక్ష్మి పాత్రలో నటించింది. ఆమె నటనకుగాను ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి స్పందన లభించింది.ఇక ఆమె రెండవ సినిమాగా విడుదలైన ‘మహానటి’ కూడ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రంలో సమంత మధురవాణి అనే జర్నలిస్ట్ పాత్రలో నటించించారు. ఈ పాత్రకు కూడ మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలా ఈ ఏడాది ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న ఈమె త్వరలో విశాల్ తో కలిసి చేసిన ‘ఇరుంబు తిరై’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకురానుంది