ప్రిన్స్ మహేశ్బాబు నటించిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మే 5వ తేదీ నాటికి 190 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా 200కోట్ల క్లబ్ లోకి చేరిపోయిందనేది తాజా సమాచారం. ‘బాహుబలి’ సినిమా సంగతిని అటుంచితే, ఇప్పటికే ‘రంగస్థలం’ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొదటి నుంచి తమిళనాట కూడా ‘భరత్ అనే నేను’ అదే ఊపును కొనసాగిస్తోండటం విశేషం. ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధించడంతో, బాలీవుడ్ నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం పోటీపడుతున్నారట. ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే అభిమానులు కోరుకున్న ఆశ ఫలించినట్టే ఉంది.