కోలీవుడ్ నటుడు ధనుష్, మలయాళ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మారి 2’. బాలాజీ మోహన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఓ సాంగ్ పాడారు. అయితే నిన్న చిత్ర హీరోయిన్ సాయిపల్లవి బర్త్ డే కావడంతో మూవీ యూనిట్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ధనుష్, డైరెక్టర్ బాలాజీ మోహన్తో పాటు టెక్నీషియన్స్ అందరు కలిసి సెట్లో సాయి పల్లవి బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఈ అమ్మడితో కేక్ కట్ చేయించారు. ప్రస్తుతం సాయి పల్లవి బర్త్డేకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాయి పల్లవి కోలీవుడ్కి దియా అనే చిత్రంతో డెబ్యూ ఇచ్చింది. ఏల్ విజయ్ తెరకెక్కించిన ఈ చిత్రం లైకా ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మితం కాగా, ఇది హరర్ మూవీగా అందరిని అలరించింది. మారి 2 చిత్రం సాయి పల్లవికి కోలీవుడ్లో సెకండ్ మూవీగా ఇది మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తుంది సాయిపల్లవి. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఎన్జీకే చిత్రంలోను సాయిపల్లవి కథానాయికగా నటిస్తుంది.
మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమమ్ చిత్రంలో మల్లర్ పాత్ర పోషించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి పల్లవి తెలుగులో ఫిదా తో భానుమతి గా అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని తమ ఇంట్లో మనిషిలా ఫీలవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. నాని సరసన ఎంసీఏ చిత్రంలో నటించి అలరించింది. ఇటీవల కణం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయిపల్లవి హోమ్లీగా, అందంగా కనిపిస్తోంది. దాంతో ప్రొడ్యూసర్లు సాయిపల్లవికి వరుస ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో శర్వానంద్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తుంది. పడి పడి లేచే మనసు అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బేనర్పై రూపొందుతుంది . రొమాంటిక్ చిత్రాల స్పెషలిస్ట్ హను రాఘవపూడి ఈ సినిమాని కూడా చాలా స్టైలిష్ గా రూపొందిస్తున్నాడని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కూడా సాయిపల్లవికి మంచి పేరు తెస్తుందని అంటున్నారు