సినిమాతారలని అందరూ అభిమానిస్తుంటే..వారు మాత్రం క్రికెటర్లను ఆరాధిస్తుంటారు. బాలీవుడ్ నటి ఆలియా భట్ ఐపీఎల్ ప్రీ మ్యాచ్ షోకి హాజరైంది. మే 11న విడుదల కానున్న ‘రాజీ’ చిత్రం ప్రచారంలో భాగంగా ఆమె ఈ షోలో పాల్గొని ఇర్ఫాన్ పఠాన్, బ్రెట్లీతో కలిసి సందడి చేసింది. ఈ క్రమంలో ఆమె క్రికెట్కు సంబంధించిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బాగా ఆకట్టుకుంటోన్న ఆటగాడు ఎవరు అని వ్యాఖ్యాతలు ఆలియాను అడిగారు. ఆమె వెంటనే కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు శివమ్ మావి అని జవాబిచ్చింది. శివమ్ మావి అంటే ఎంతో ఇష్టం. గాయపడినా కూడా టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. యువ ఆటగాళ్లు తమ సత్తాను నిరూపించుకునేందుకు ఐపీఎల్ ద్వారా గొప్ప వేదిక దొరికింది. ఐపీఎల్ ఓ ఫ్యామిటీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరూ దీన్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారని పేర్కొంది.