కింగ్ నాగార్జున, దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన 'ఆఫీసర్' సినిమా నుండి తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు. 'ప్రతీ మనిషిలో ఒక దేవుడు రాక్షసుడు ఇద్దరూ ఉంటారు' అంటూ నాగార్జున చెప్పే డైలాగు లతో ట్రైలర్ మొదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు టీజర్ లను విడుదల చేయగా వాటికీ మంచి స్పందన లభించింది. కాగా, ఈనెల 25న విడుదలవుతున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన మైరా సరీన్ హీరోయిన్గా నటిస్తుంది.