శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఫిదా చిత్రం టీజర్ శనివారం (జూన్ 17న విడుదలైంది. ఈ టీజర్ను ఫీల్గుడ్ ఉండేలా కట్ చేశారు. 29 సెకన్ల నడివి ఉన్న టీజర్కు మంచి స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.ట్రైన్లో వెళ్తున్న సాయి పల్లవి బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. అని వార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని టీజర్లో చూపించారు. అందుకు సమాధానంగా ఏం పిల్లరా అని వరుణ్ తేజ్ అనే సన్నివేశం ఉంది.