పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం శ్రీకాళహస్తీశ్వరుడ్ని దర్శించుకున్నారు.. శ్రీకాళహస్తి చేరుకున్న ఆయనకు ఆలయం ఈవో భ్రమరాంబ, ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని సర్వదర్శన క్యూలైన్లో వెళ్ళి జ్ఞాన ప్రసునాంబ సమేత శ్రీవాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు పవన్కు తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం పవన్ గుడిమల్లంలోని పరుశురామశ్వేరస్వామి ఆలయం, వికృతమాలలోని శ్రీ సంతాన వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.