ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర తన అకౌంట్ నుంచి రూ.1.18 లక్షల డబ్బు మాయమైందని కస్బా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన ప్రమేయం లేకుండా తన ఖాతా నుంచి లక్షల సొమ్మును ఏడాదిగా మరో ఖాతాకు మళ్లీస్తూ మోసం చేస్తున్నారంటూ ఓ బ్యాంకు ఫైనాన్స్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు బ్యాంకు ఫైనాన్స్ సంస్థలోని కొందరు ఉద్యోగులు తన ఖాతా సమాచారాన్ని లీక్ చేసి ఫోర్జరీ సంతకంతో బోసెపూకుర్లోని మరో అకౌంట్కు బదిలీ చేసి మోసానికి పాల్పడినట్టు ఆరోపించింది.
శ్రీలేఖ ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కస్బా పోలీసుల విచారణలో శ్రీలేఖ సదరు ఫైనాన్షియల్ కంపెనీ నుంచి కొన్నిఏళ్ల క్రితం రుణాన్ని పొందినట్టు తేలింది. ఆ సమయంలో ఆమెకు ఓ ఈఎంఐ కార్డును జారీ చేశారు. అయితే, ఈ రుణానికి సంబంధించిన మొత్తాన్ని తాను ఎప్పుడో పూర్తి చేశానట్టు చెబుతోంది. కానీ, శ్రీలేఖ రుణాన్ని పొందిన ఏడాది మధ్య నుంచి రూ. 6 వేల చొప్పున ప్రతినెలా ఆమె బ్యాంకు ఖాతాలో డిబెట్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు.