మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందింన మహానటి ఇటీవల రిలీజైంది. కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విదేశాల్లో సైతం కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తున్నది.. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆకట్టుకుంటున్న ఈ మూవీ అమెరికా ఇప్పటి వరకూ 1.5 మిలియన్ డాలర్లు సాధించి రెండు మిలియన్ డాలర్ల్ క్లబ్ కు వేగంగా దూసుకుపోతున్నది.నాగ్ అశ్వీన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, తదితరులు నటించారు.. స్వప్నదత్, ప్రియాంకా దత్ లు ఈ మూవీకి నిర్మాతలు.. కాగా, ఈ మూవీ విజయం సాధించడంపై మోహన్ బాబు హర్షం వ్యక్తం చేశాడు.. ఈ చిత్ర టీమ్ ను తన ఇంటికి ఆహ్వానించి సత్కరించాడు.. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంకా దత్ లు ఈ సత్కారాన్ని పొందారు