నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం సవ్యసాచి. దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ ఈ చిత్రంతో టాలీవుడ్లో తెరంగేట్రం చేస్తోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి సవ్యసాచి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం న్యూయార్క్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. 15 రోజుల న్యూయార్క్ షెడ్యూల్లో ఒక పాట సహా కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…సవ్యసాచి ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్కు విశేషమైన స్పందన వచ్చింది.
ప్రేమమ్ లాంటి సూపర్హిట్ తర్వాత చందూ మొండేటి నాగచైనత్య కాంబినేషన్ చిత్రం కాబట్టి సవ్యసాచిపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు ఈ చిత్రాన్ని కొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నారు. మాధవన్ పోషిస్తున్న కీలక పాత్రతో పాటు నాగచైతన్య అక్క పాత్రలో భూమిక ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. బాహుబలి చిత్రాల తర్వాత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. పాటలు అద్భుతంగా వచ్చాయి. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా సంస్థలో సవ్యసాచి మరో విజయాన్ని అందిస్తుందనే నమ్మకముంది అన్నారు. రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం – యువరాజ్, కళ – రామకృష్ణ, కూర్పు – కోటగిరి వెంకటేశ్వరరావు, పోరాటాలు – రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత – ప్రవీణ్ ఎం