కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య 37వ చిత్రంలో నటించనున్నాడు. మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో విలన్గా కనిపించనుండగా.. అల్లు శిరీశ్ మరో కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా సాయేషా ఎంపికైనట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం కార్తీ సరసన ‘కడై కుట్టి సింగం’ చిత్రంలో నటిస్తున్న సాయేషా తాజాగా సూర్య చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, హారీశ్ జైరాజ్ సంగీతాన్ని అందించనున్నాడు. కాగా సూర్య ప్రస్తుతం ‘ఎన్జీకే’ చిత్రంలో నటిస్తున్నాడు. అందులో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి నటిస్తున్నారు.