మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం విజయోత్సాహంతో బోయపాటి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుండగా, బోయపాటి కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు . కన్నడ హీరో సుదీప్ ఈ సినిమాలోను విలన్గా కనిపిస్తాడని అంటున్నారు . ఇక చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), నవీన్ చంద్ర లు నటిస్తున్నారు. డీవివి ఎంటర్టైన్మెంట్ బేనర్పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుందని తెలుస్తుంది. ఈ మూవీకి రాజవంశస్థుడు, రాజ మార్తాండ అనే టైటిల్స్ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుంది. షూటింగ్ తర్వాత వర్కవుట్స్ కోసం జిమ్కి వెళుతున్నారట చెర్రీ, కైరా. ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలియజేస్తూ ‘షూటింగ్ ప్యాకప్... నెక్ట్స్ కో–స్టార్తో కలిసి వర్కౌట్స్ చేస్తున్నా’’ అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టింది కైరా. ఇక చెర్రీ సతీమణి చెరువులో చెర్రీ చేపలకి ఆహారం వేస్తున్న వీడియోని షేర్ చేస్తూ ఖాళీ సమయంలో చరణ్ ఈ పని చేస్తున్నాడంటూ పేర్కొంది.