మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. . అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుంది. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో కథానాయిక. షూటింగ్ తర్వాత వర్కవుట్స్ కోసం జిమ్కి వెళుతున్నారు చెర్రీ, కైరా. ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలియజేస్తూ ‘షూటింగ్ ప్యాకప్… నెక్ట్స్ కో–స్టార్తో కలిసి వర్కౌట్స్ చేస్తున్నా’’ అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టింది కైరా. కాగా, బ్యాంకాక్ లో బోయపాటి కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు.. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు . కన్నడ హీరో సుదీప్ ఈ సినిమాలోను విలన్. ఇక చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), నవీన్ చంద్ర లు నటిస్తున్నారు. డీవివి ఎంటర్టైన్మెంట్ బేనర్పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది.
This video of @Advani_Kiara & #RamCharan working out together will definitely give you fitness goals!#RC12 #FitnessGoals #KiaraAdvani #Tollywood #TeluguFilmnagar pic.twitter.com/EgoYB2falb
— Telugu Filmnagar (@telugufilmnagar) May 19, 2018