మయన్మార్లోని రఖైన్ రాష్ట్రం నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్కు వలస వచ్చి అక్కడి శరణార్ధుల శిబిరాల్లో తల దాచుకుంటున్నారు.. డాకాలో రోహింగ్యా శరణార్థులు ఆశ్రయం పొందుతున్న క్యాంపును బాలీవుడ్ నటి, యునిసెఫ్ బాలల హక్కుల అంబాసిడర్బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సందర్శించారు. శరణార్దులతో ఆమె కొంత సేపు మాట్లాడారు.. అక్కడి చిన్నారులకు ఆమె ధైర్యం చెప్పారు.. కాగా హాలివుడ్ స్నేహితురాలు మేఘన్ మెర్కెల్, బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆమె నేరుగా లండన్ వెళ్లింది.. అక్కడి వివాహ వేడుకల్లో సందడి చేసిన ప్రియాంకా లండన్ నుంచి నేరుగా విమానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళ్లారు. ఈ సందర్భంగా తన ట్విటర్ ద్వారా ఓ సందేశాన్ని ఇచ్చారు. యునిసెఫ్ ఫీల్డ్ సందర్శనలో భాగంగా రోహింగ్యా శరణార్థుల క్యాంపును సందర్శించాను. బాలలకు ఆశ్రయమిచ్చి వారిని ఆదుకోవాలి. వారిపై ప్రపంచం శ్రద్ధ చూపించడం అవసరం. మనము కూడా వారిపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ట్వీట్ చేసింది.