నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం నా నువ్వే.. ఈ మూవీలో తమన్నా హీరోయిన్.. జయేంద్ర దర్శకుడు..ముప్పవరపు కిరణ్ – విజయ్ కుమార్ వట్టికూటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదిన విడుదల కానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.. అయితే తాజాగా రిలీజ్ తేదిని జూన్ ఒకటో తేదికి మార్చినట్లు ప్రకటన విడుదల చేసింది.. ఈ నెల 25వ తేదిన రవితేజ నేల టిక్కెట్, నాగ శౌర్య అమ్మమ్మ గారిల్లు మూవీలు రిలీజ్ కానున్నాయి.. దీంతో పోటీని నివారించేందుకు కళ్యాణ్ వెనక్కి తగ్గినట్లు టాక్..