బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ సాహో.. ఈ మూవీ షూటింగ్ గత కొన్ని రోజులుగా దుబాయ్ లోని అబుదాబిలో కొనసాగుతున్నది.. రూ 90 కోట్ల బారీ బడ్జెట్ తో అక్కడ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.. సహజత్వం కోసం ప్రభాస్ స్వయంగా రిస్క్ తీసుకుని యాక్షన్ సీన్స్ లో నటిస్తున్నాడు.. డూప్ ను పెడదామన్నా అతడు ఒప్పుకోవడం లేదు.. ఇప్పటికే రెండు సార్లు స్వల్పంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి స్నేహితురాలు, లేడీ సూపర్ స్టార్ అనుష్క స్వయంగా బయలుదేరి అబుదాబీకి చేరుకుంది..రిస్కీ షాట్స్ పై అతడికి క్లాస్ పీకింది.. గాయాలు పెద్దవి తగిలితే అభిమానులు ఎంతో బాధపడతారని తెలిపింది. గాయాల వల్ల షూటింగ్ కు అంతరాయం ఏర్పడి కొన్ని కోట్లు నష్టం వస్తుందని, నటీనటులు షెడ్యూల్స్ లో మార్పుల వల్ల అనుకున్న విధంగా షూటింగ్ జరగక రిలీజ్ తేది మార్చాల్సిన స్థితి వస్తుందటూ సున్నితంగా నచ్చచెప్పింది..రిస్క్ తో కూడుకున్న షాట్స్ ను డూప్ సహాయంతోనే పూర్తి చేయాలని కాస్తంత గట్టిగానే అనుష్క చెప్పేసరికి, సరేనంటూ తలూపిన ప్రభాస్, డూప్ ను పెట్టుకుంటానని ప్రామిస్ కూడా చేశాడని సమాచారం..ఇక అక్కడ షూటింగ్ ఈ వారంలో పూర్తి కానుంది. దీని తర్వాత ప్రభాస్ హైదరాబాద్ కు రానున్నాడు..