నేచురల్ స్టార్ నానీ గతంలో వెప్పం అనే తమిళ మూవీలో నటించి అక్కడ అడుగుపెట్టాడు.. తిరిగి చాలా కాలం తర్వాత మరో తమిళ మూవీలో హీరోగా నటింనున్నాడు.. సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందనున్నవేలన్ ఎట్టుత్తిక్కుమ్ చిత్రంలో నాని ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. నానీ సరసన సంచలన నటి అమలాపాల్ కథానాయికగా నటిస్తుంది. శరత్ కుమార్, నాజర్, చిత్రలక్ష్మణన్, శివబాలాజి, పార్వతీమీనన్, నాగిని త్రివేది తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజుల్లో అవినీతి, లంచం వంటి అక్రమాలు జరగని దేశమే లేదు. అదే విధంగా ఎంత పెద్ద నేరానికి అయినా ఒక రేటును నిర్ణయింపబడుతోంది. నేరస్తులు నిరపరాధులుగా, నిరపరాధులు నేరస్తులు గానూ మార్చబడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని మార్చడానికి అరవింద్ అనే యువకుడి చేసిన పోరాటమే వేలన్ ఎట్టుత్తిక్కుమ్ చిత్రం అని నిర్మాత తెలియజేశారు. సామాజిక సందేశంతో కూడిన యాక్షన్ చిత్రంగా ఈ మూవీ రూపొందుతుండగా, చిత్రానికి జీవీ ప్రకాశ్ బాణీలు అందిస్తున్నారు. అతి త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. కాగా గతంలో నానీ, అమలాపాల్ తెలుగు మూవీ జండాపై కపిరాజులో కలసి నటించారు.. ఆ మూవీ తర్వాత ఈ ఇద్దరూ కలసి నటిస్తున్న తమిళ మూవీ ఇది.