ప్రతి ఒక్కరిలోనూ ఫిట్నెస్ను పెంచాలనేది నరేంద్ర మోదీ అభిలాష కాగా, ఆయన కోసం ఫిట్ నెస్ ఛాలెంజ్ మొదలు పెట్టారు కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్. ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ పేరుతో మొదలైన కొత్త ఛాలెంజ్కి సూపర్భ్ రెస్పాన్స్ వస్తుంది. సినీ సెలబ్రిటీలు, సామాన్యులు, క్రీడాకారులు కూడా ఈ ఛాలెంజ్లో పాల్గొంటున్నారు. ముందుగా రాజ్యవర్ధన్ తాను పుషప్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, క్రికెట్ విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్కి సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్ని సైనా, హృతిక్ స్వీకరించారు. ఆ తర్వాత పి.వి సింధు, కోహ్లి, అనుష్క శర్మ, నటుడు అఖిల్ తదితరులు కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు.
సింధు సవాల్ స్వీకరించిన అఖిల్ తాను జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ .. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, వరుణ్ ధావన్లకి ఈ సవాల్ విసిరాడు. వీరిలో చైతూ ముందుగా స్పందించి తన ఫిట్ నెస్ వీడియో షేర్ చేస్తూ ఈ ఛాలెంజ్ లో సమంత, నిధి అగర్వాల్ , సుశాంత్ లు పాల్గొనమని కోరాడు . దీనికి స్పందించిన సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఛాలెంజ్ స్వీకరిస్తున్నానని చెబుతూ ‘పుల్ అప్’ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకి కామెంట్ కూడా పెట్టింది. కొన్నేళ్లుగా జిమ్ ట్రైనర్ ‘పుల్ అప్’ చేయమని చెబుతున్నారు. కానీ నేను తలనొప్పి, మంచి రోజు కాదు, కడుపునొప్పి, పళ్లు నొప్పి, నా పప్పికి ఆరోగ్యం బాలేదు, తొందరగా వెళ్ళాలి.. ఇలా ఏవేవొ కారణాలు చెబుతూ తప్పించుకున్నా. కాని చివరికి పుల్ అప్ చేయాలని నిర్ణయించుకున్నాను. అందంగా ఉండేందుకు ఫిట్గా ఉండాలని నేనెప్పుడు అనుకోలేదు. ఇది ఓ క్రమ శిక్షణ, మర్యాద, ఆత్మవిశ్వాసం మరియు శక్తి. ఉపాసన, శిల్పారెడ్డి, రకుల్ ప్రీత్సింగ్లకి నేనే ఈ ఛాలెంజ్ విసురుతున్నాను అంటూ తన పోస్ట్లో తెలిపింది సమంత .