ఇప్పటివరకు తెలుగు వారికి మహానటి అంటే సావిత్రి గుర్తుకొచ్చేది.. ఇకపై సావిత్రి అంటే కీర్తి సురేష్ గుర్తుకొస్తుందేమో. అంతలా మహానటి సావిత్రి పాత్రలో లీనమైపోయింది కీర్తి సురేష్. మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన `మహానటి` సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి నటనకు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపించారు.
తాజాగా `మహానటి` టీమ్ ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా తనకు ఈ సినిమాతో లభించిన గౌరవం గురించి కీర్తి ట్వీట్ చేసింది. `సావిత్ర అమ్మ పాత్ర నాకు లభించడాన్ని, ఇంతమంది ఆమోదాన్ని పొందాడన్ని గొప్ప వరంగా భావిస్తున్నా. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబుగారికి ధన్యవాదాలు. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్న, ప్రియాంకతోపాటు సాంకేతిక నిపుణులందరికీ రుణపడి ఉంటాన`ని కీర్తి ట్వీట్ చేసింది.