ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో క్రేజీ ప్రాజెక్ట్లు గా చెప్పుకుంటున్న బయోపిక్లలో ఎన్టీఆర్ ఒకటి. నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ముందుగా ప్రకటించిన, ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తెరెకక్కించిన క్రిష్ చేతికి వెళ్లింది. ప్రస్తుతం ఆయన స్క్రీన్ప్లేని మార్చుకొని రెగ్యులర్ షూటింగ్కి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లాంచ్ అయి చాలా రోజులే కావొస్తున్నా మూవీ సెట్స్ పైకి వెళ్ళకపోయే సరికి అభిమానులలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవుతుందని బాలయ్య ముందుగానే ప్రకటించడంతో సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఈ మేరకు జూలై 5న షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పాత్రల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా, ఫస్ట్ షెడ్యూల్ ఫిలిం సిటీలోను, రామ కృష్ణ సినీ స్టూడియోలో చిత్రీకరించున్నారట. ఈ చిత్రంలో బాలయ్య 64 పాత్రలలో కనిపించనున్నాడు. బాలయ్య తల్లి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటించనుంది.