అంజలి, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలలో రాజ్ కిరణ్ తెరకెక్కించిన చిత్రం గీతాంజలి. 2014లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. హరర్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో చెప్పిన, ఇప్పటి వరకు అది క్యార్యరూపం దాల్చలేదు. అయితే కొద్ది సేపటి క్రితం సీక్వెల్ ప్రాజెక్ట్కి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. మొదటి భాగాన్ని నిర్మించిన కోన వెంకట్, ఎం.వి.వి సినిమాస్ ఈ సీక్వెల్ ను నిర్మించనున్నారు. తొలి పార్ట్లో అలరించిన అంజలి రెండో పార్ట్లోను ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రవాస భారతీయుడు సీక్వెల్ని తెరకెక్కించనున్నాడు. చిత్రంలో మిగతా నటీనటులు, మూవీ రెగ్యులర్ షూట్ ఎప్పుడు ఉంటుందనే వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు