ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కైరా అద్వానీ హ‌వా కొన‌సాగ‌నుందా

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 18, 2018, 11:18 AM



ఎంఎస్ ధోని చిత్రంతో పాపుల‌ర్ అయిన కైరా అద్వానీ భ‌రత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో కైరా ప‌ర్‌ఫార్మెన్స్‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. టాలీవుడ్‌లో కైరా న‌టించిన తొలి సినిమా విడుద‌ల కాకుండానే భ‌ర‌త్ అనే నేను చిత్ర నిర్మాత డివివి దానయ్య త‌న సినిమాలో మ‌రో ఆఫ‌ర్ ఇచ్చాడు . మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్న‌ చిత్రం కూడా డివివి దాన‌య్య నిర్మాణంలో రూపొందుతుండ‌గా, ఈ సినిమాలోను కైరా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇటీవ‌లే ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. క‌ట్ చేస్తే రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న మ‌ల్టీ స్టార‌ర్ కూడా డీవీవీ దాన‌య్య నిర్మాణంలోనే రూపొంద‌నుంది. ఈ సినిమాలో కూడా కైరానే క‌థానాయిక‌గా ఎంపిక చేశార‌ని అంటున్నారు. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌నున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్ 250 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నుంది. ఈ ప్రాజెక్ట్‌లోను కైరానే క‌థానాయిక‌గా ఎంపికైతే మాత్రం రానున్న రోజుల‌లో ఈ అమ్మ‌డి హ‌వా మాములుగా ఉండ‌ద‌నే చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com