సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్, మెగా హీరోయిన్ నిహారిక ప్రధాన పాత్రలలో నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది..క్రియా ప్రొడక్షన్ కార్పొరేషన్, కాళి ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్ లో రూపొందుతున్న ఈ మూవీకి గౌతమి పుత్ర శాతకర్ణి, కంచె మూవీలకు సినిమాటోగ్రఫీ అందించిన జ్ఞాన శేఖర్ నిర్మాత. ఈ మూవీ ద్వారా సుజనా దర్శకురాలిగా పరిచయమవుతున్నది.. ఈ మూవీ ప్రారంభం సందర్భంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.. శ్రియా శరణ్, క్రిష్, వరుణ్ తేజ్, జ్ఞాన శేఖర్, సుజనా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ తర్వాత తొలి ముహూర్తం షాట్ కు వరుణ్ తేజ్ క్లాప్ ఇచ్చారు.. ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకుడిగా క్రిష్ వ్యవహరించారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.