గోపీ చంద్, మెహ్రీన్ జంటగా నటించిన మూవీ పంతం.. చక్రి ఈ మూవీకి దర్శకుడు.. ఈ మూవీ వచ్చే నెల 5వ తేదిన విడుదల కానుంది. ఈ మూవీకి కె కె రాధామోహన్ నిర్మాత. ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను ఈ నెల 21వ తేదీన విజయవాడలోనూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 24వ తేదీన విశాఖలో చిత్ర యూనిట్ నిర్వహించనుంది..కాగా ఈ మూవీలో రైట్ నౌ సాంగ్ ను రేపే చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.. ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం సమకూర్చాడు..