ఉదయం ప్రతి ఇంటికి పేపర్ అందించే బాయ్ గురించి అందరికీ తెలిసిందే. సంపత్ నంది, వెంకట్, నరసింహ కలిసి పేపర్ బాయ్ పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్, ప్రియాశ్రీ, తన్య హోప్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. టాకీపార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్, ముంబాయి, లోనవాల, పూనే, కేరళ, గోవా వంటి నగరాల్లో తెరకెక్కించారు. జూలైలో సినిమాు విడుదల చేస్తారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు సంపత్ నంది, సంగీతం భీమ్స్, దర్శకత్వం వి.జయశంకర్.